షేక్ జాకీర్ హుస్సేన్ కు గుడివాడ జనసేన ఆర్థిక సహాయం

గుడివాడ నియోజకవర్గం, కార్మిక నగర వార్డ్ మైనారిటీ కుటుంబానికి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు షేక్ జాకీర్ హుస్సేన్, గత రెండునెలల క్రితం రోడ్డు ప్రమాదం జరిగి ప్రమాదంలో తగిలినటువంటి గాయాలకు పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ వాడగా అవి వికటించి 28 సంవత్సరాల వయసుగల షేక్ జాకీర్ హుస్సేన్, రెండు కిడ్నీలు పాడైపోయి నేడు ప్రాణాపాయ స్థితిలో ఉన్న మైనారిటీ కుటుంబానికి గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు సందు పవన్ ఆధ్వర్యంలో 20వేల రూపాయల ఆర్థిక సహాయం షేక్ జాకీర్ హుస్సేన్ అమ్మగారికి అందించడం జరిగింది. జనసేన పార్టీ ఆ కుటుంబానికి ఎప్పుడు అండగా ఉంటుందని కుటుంబ పరిస్థితిని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామని ఆ కుటుంబానికి భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన, నియోజకవర్గ నాయకులు పాలంకి సారధి బాబు కి (జిల్లా కార్యదర్శి) పేర్ని జగన్ కి నా హృదయపూర్వక ధన్యవాదములు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కొట్టే శివ, సాయిన నాని, సూరిశెట్టి రాజబాబు, జనసేన పార్టీ మైనారిటీ నాయకులు షేక్ రబ్బానీ, యూత్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.