జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా రాజంపేట జనసేన పార్టీ ఇన్చార్జి మలిశెట్టి వెంకటరమణ సహకారంతో శుక్రవారం ఇద్దరు నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సాయం చేశారు. కొత్త మాధవరం ముకుండా శ్రమం గ్రామానికి చెందిన దత్తాపురం మధు గత మూడు నెలల క్రితం మాధవరం-1 పంచాయతీలోని వాసవి కాలేజ్ ఎదురుగా రోడ్డు ప్రమాదానికి గురై మృత్యువాత పడ్డాడు. దీంతో వారి కుటుంబం రోడ్డున పడింది. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉండగా నిరుపేద కుటుంబం కావడంతో జీవనాధారం ఇబ్బందికరంగా మారింది. దీంతో జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య రూ.10 వేల చెక్కును అందించారు. అలాగే మరో నిరుపేద కుటుంబ మహిళ అయిన రాగూరు శ్రావణికి రూ10 వేల చెక్కు అందించారు.
Share this content:
Post Comment