జనసేన నాయకుడు, పేదల ఆశాజ్యోతి, ఎన్వీఆర్ ట్రస్ట్ అధ్యక్షుడు ఎన్.వేణుగోపాల్ రెడ్డి సోమవారం పలువురు ఆర్తులు, అనారోగ్య బాధితులు, విద్యార్థులు, ఆలయాలకు ఆర్థిక సహాయం అందజేశారు. చదళ్లలోని ఆయన నివాస గృహం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో మాగాండ్లపల్లి పంచాయతీ భరినేపల్లిలో ఓంశక్తి అమ్మవారి ఆలయ నిర్మాణానికి రూ.60 వేల విలువైన సామాగ్రిని అందజేశారు. అదేవిధంగా బత్తలాపురం కవితకు రూ. 10000/-, నల్లరాలపల్లి వరలక్ష్మికి 10,000/-, ఉలవలదిన్నె బి.నారాయణకు రూ. 7000/-, బీర్జేపల్లి మదన్మోహన్ కు రూ.7000/-, మదనపల్లిలో క్యాన్సర్ పేషెంట్ అర్షియాకు రూ. 5000/-, కొత్తపేటలో క్యాన్సర్ పేషెంట్ ఖాదర్ బాషా కు రూ. 10000/- వైద్య సహాయం నిమిత్తం అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకుడు ఎన్వీఆర్ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి శివకుమార్ రెడ్డి, నరేంద్ర రెడ్డి, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment