బాధితుల‌కు జ‌న‌సేన నాయ‌కుల ఆర్థిక‌సాయం

ప్ర‌కాశం జిల్లా, ద‌ర్శి మండ‌లం, పెద్ద ఉయ్యాల‌వాడ గ్రామంలో ఇటీవ‌ల‌ పిడుగుపాటుకు గురై మృతి చెందిన నాగేండ్ల రానెమ్మ కుటుంబ స‌భ్యుల‌ను సోమ‌వారం ద‌ర్శి నియోజ‌క‌వ‌ర్గ జ‌న‌సేన నాయ‌కులు ప‌రామ‌ర్శించారు. ప్ర‌కాశం జిల్లా జ‌న‌సేన పార్టీ ప్రోగ్రామ్ క‌మిటీ స‌భ్యులు ప‌సుపులేటి చిరంజీవి, ఐటీ విభాగం కోఆర్డినేట‌ర్ ఉల్లి బ్ర‌హ్మ‌య్య‌, ద‌ర్శి ప‌ట్ట‌ణ పార్టీ అధ్య‌క్షులు చాత‌రాసి కొండ‌య్య‌, నియోజ‌క‌వ‌ర్గ నాయ‌కులు పుప్పాల పాపారావు, కొండారు వెంక‌టేష్‌, పసుపులేటి ఆంజ‌నేయులు, అంకిరెడ్డి, బాలాజీ, పి.కిర‌ణ్‌, సిహెచ్ సాయితేజ, జి.చందు సోమ‌వారం గ్రామానికి వెళ్ళి బాధిత కుటుంబ స‌భ్యుల‌కు త‌మ ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. అనంత‌రం రూపాయలు 15000/- ఆర్థిక‌సాయం అంద‌జేశారు. బాధితులకు అండ‌గా ఉంటామని భ‌రోసా క‌ల్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.