జనసేన ఆధ్వర్యంలో మత్స్యకారుల భరోసా యాత్ర

కాకినాడ సిటీ ఏటిమొగ ప్రాధమిక పాఠశాల వద్ద గురువారం సాయంత్రం 5.30 గంటలకు 15 వ వార్డు పెమ్మాడి సాంబశివ ఆధ్వర్యంలో కాకినాడ సిటి ఇంచార్జ్ మరియు పి.ఏ.సి మెంబర్ ముత్తా శశిధర్ ఆదేశాల మేరకు “మత్స్యకారుల భరోసా యాత్ర” కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా తమ పార్టీ తరపున పవన్ కళ్యాణ్ ప్రకటించిన మానిఫెస్టోలోని మత్స్యకారులకు సంవత్సరానికి 300 ల రోజులు పని ఉండేలా చేయడం మరియు వేటలేని సమయంలో ఆర్ధికంగా ఇబ్బంది పడే కుటుంబాలకు రోజుకి 500 రూపాయల పరిహారం అందించడం అన్న ప్రణాళికని ఇంటి ఇంటికీ తిరిగి తెలియచేసారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు సంగిశెట్టి అశోక్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వాసిరెడ్డి శివ, మత్స్యకార నాయకులు, వీర మహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.