కొమరగిరిపట్నం జనసేన ఆధ్వర్యంలో జెండా వందనం

గణతంత్ర దినోత్సవ సందర్భంగా అల్లవరం మండలం కొమరగిరిపట్నం గ్రామంలో జరిగిన జెండా వందనం కార్యక్రమానికి అమలాపురం అసెంబ్లీ జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి శెట్టిబత్తుల రాజబాబు ముఖ్య అతిథిగా విచ్చేసి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ నాయకులు నార్ని అన్నపూర్ణ, పలచోళ్ల వేణు, కటిక రెడ్డి బాబి, నల్ల రాము, పిండి గణపయ్య, పోచనపెద్ది వెంకటేష్, బుంగ మధు, కొండేపూడి రవి, ఆకుల నాగ శ్రీను, తిరుమల రమేష్, కొమ్ముల పవన్, పితాని జీవన్ మరియు చింతలపూడి రమేష్ పాల్గొన్నారు.