మనోభావాలు దెబ్బతీసే ఫ్లెక్సీలను తొలగించాలి: ఉన్నమట్ల ప్రేమ్ కుమార్

పశ్చిమగోదావరి జిల్లా, పాలకొల్లు: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ని అవమానపరుస్తూ పట్టణ నందు పలుకూడల్ల లో వెలసిన ఫ్లెక్సీలు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ కురుచ్చున్నటువంటి పల్లకి మోస్తున్న పవన్ కళ్యాణ్ బొమ్మతో ఫ్లెక్స్ బ్యానర్ ఏర్పాటు చేసిన వైసీపీ పార్టీ నాయకులు తక్షణం ఫ్లెక్స్ లను తొలగించాలంటూ తొలగించకపోతే జనసేన పార్టీ తరఫున రాష్ట్రవ్యాప్తంగా నిరసన తెలుపుతామని జనసేన జిల్లా నాయకులు ఉన్నమట్ల ప్రేమ్ కుమార్ హెచ్చరించారు. 24 గంటల్లో వివాదాస్పదంగా ఉన్న ఫ్లెక్సీలను తొలగించకపోతే జరిగే రెట్టంపు ఫ్లెక్సీలను జనసేన పార్టీ తరపున ఏర్పాటు చేస్తామని, వాటిని తొలగించకుండా మేము పెట్టిన ఫ్లెక్సీలను తొలగిస్తే సహించేది లేదని చెప్పారు. నియంత పరిపాలన నశించాలని ప్రజా పాలన, జనసేన పాలన రావాలని నినాదాలు చేశారు. తక్షణం లా అండ్ ఆర్డర్ కాపాడుతూ ఫ్లెక్స్ బ్యానర్స్ తొలగించి శాంతిభద్రతలు కాపాడాలంటూ పాలకొల్లు పట్టణ సి. ఐ రాంబాబుకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు లక్ష్మి నారాయణ బిట్టా, కాశెట్టి సురేంద్ర, ఆర్. డి ప్రసాద్, మొయిలే ప్రదీప్, కవురు యశ్వంత్, చెన్నం శెట్టి గోవర్ధన్, బి తులసీరామ్, బి సురేష్, పి వెంకట నవీన్, సుంకర గణేష్, సీరియలా ప్రసాద్, కె సురేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు.