నగరి జనసేన ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్స్ కి అన్నదాన కార్యక్రమం

నగరి: పుత్తూరు తహసీల్దార్ కార్యాలయంలో అంగన్వాడీ వర్కర్స్ చేపట్టిన ధర్నా కార్యక్రమంలో జనసేన పార్టీ చిత్తూర్ జిల్లా ఉపాధ్యక్షులు బత్తిన మధుబాబు సహకారంతో అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నగరి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జీ మెరుపుల మహేష్, గోపిరాయాల్, కటికం నాగార్జున, దేవ, కృష్ణయ్య, సిపీఐ, సిపియం నాయకులు వెంకటేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.