లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి ఆధ్వర్యంలో “నా సేన కోసం… నా వంతు”

అనంతపురం, జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటా జనసేన కార్యక్రమంలో భాగంగా, అనంతపురం నియోజకవర్గంలో “నా సేన కోసం… నా వంతు” కార్యక్రమ ఆవశ్యకతను తెలియజేసి ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ నందుపుర ప్రజలతో మమేకమై, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఏ ఆశయ సాధన కోసమైతే జనసేన పార్టీని స్థాపించారో… ఆ ఆశయాలను వివరిస్తూ, స్థానిక ప్రజలతో మమేకమై స్థానిక సమస్యలు తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి, పాలగిరి చరణ్ తేజ, మెరుగు శ్రీనివాస్, జయకృష్ణ, ఎల్లుట్ల మంజునాథ్ మరియు జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.