P.Gannavaram: మాజీ ముఖ్యమంత్రి శ్రీ దామోదరం సంజీవయ్య గారికి పాలాభిషేకం

24-10-2021 ఆదివారం ఉదయం 11గంటలకు పి.గన్నవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఆద్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి శ్రీ దామోదరం సంజీవయ్యగారికి పాలాభిషేకం.

పి.గన్నవరం జంక్షన్ లో జరిగిన కార్యక్రమంలో పి.గన్నవరం మండల జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ వాసంశెట్టి కుమార్ సభాద్యక్ష్యత వహించగా… జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు శ్రీ శిరిగినీడి వెంకటేశ్వరరావు ముఖ్య అతిధిగా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ దామోదర సంజీవయ్యగారికి పాలాభిషేకం చేసారు.

శ్రీ దామోదర సంజీవయ్యగారి సేవలు గుర్తించి కర్నూలు జిల్లాకు వారి పేరును నామకరణం చేయాలని మా ప్రధాన డిమాండ్. జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ శ్రీ సంజీవయ్య స్మారక భవనం నిర్మాణం కోరకు కోటి రూపాయలు విరాళంగా ఇవ్వనున్నారు, భారతదేశంలో దళిత, బడుగు బలహిన వర్గాల ప్రజలకు అనేక సేవలు, సంక్షేమ పధకాలను అందించిన మహానీయులను గుర్తుంచుకోవడం మన కనీస బాధ్యత. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు కావస్తోన్నా అటువంటి నిశ్వార్ద నాయకుడుని గుర్తించకపోవడం శోచనీయం ఎంతోమంది ముఖ్యమంత్రులు మారి పరిపాలన చేసినా ఆయన ఒక దళిత ముఖ్యమంత్రి కావటంతో వారి సేవలను గుర్తించలేదు.

ఈరోజున అంబేద్కర్, పూలే మరియు కాన్షీరాం వంటి వారి ఆశయాలలో సేవే మార్గం అన్న ఆలోచనతో అన్ని కులాలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు జనసేనపార్టీ ఆవిర్భవించింది అని చెప్పటానికి శ్రీ సంజీవయ్య గారి ఆశయాలు, లక్ష్యాలు, ప్రజలతో మమేకమై రాబోయే రోజుల్లో జనసేనపార్టీ ప్రజలకు బాసటగా నిలుస్తుంది. పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు. కోటి రూపాయలు వారి స్మారక భవనానికి ప్రకటింనందుకు పి.గన్నవరం నియోజకవర్గం జనసేన పార్టీ తరపున శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.

ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ సెక్రటరీ ముద్దా చంటి, దొమ్మేటి సాయికృష్ణ, సర్పంచ్ లు పసుపులేటి రామకృష్ణ, యర్రంశెట్టి తాత, మండల పరిషత్ ఉపాక్షులు పాలూరి వీరభద్రరావు, జాలెం శ్రీనివాస్ రాజా, కుప్పాల ఈశ్వరి రాంబాబు , ఎంపిటీసి పప్పుల సాయిబాబు, యన్నాబత్తుల నాగరాజు, శ్రీ సుంకర పేరయ్య నాయుడు, వీరమహిళ శ్రీమతి అడ్డగళ్ల సిరిజ్యోతి, మట్టపర్తి సోమేశ్వరరావు, తాటికాయల శ్రీనివాస్, చింతపల్లి సితారామ్, పోతు కాశీ, కొర్లపాటి వెంకటేశ్వరరావు (డిల్లీ), జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.