తాసుబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్

విశాఖ, క్యాన్సర్ ను జయంచడానికి తాసుబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో తొలి అడుగుగా సోమవారం ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వందలాదిమందిగా వచ్చిన వారికి ఉచిత స్క్రీనింగ్ పరీక్షలు, డాక్టర్ పాండు రంగా కుమారి కేజిహెచ్, హెచ్.ఓ.డి, అంకాలజి, డాక్టర్ శీతల్ మదన్, డాక్టర్ నారాయణ స్వామి జయరాం, డాక్టర్ విఠల్ కుమార్ ల వైద్య విధానంతో పాటుగా వారి అమూల్యమైన సందేశంతో అవేర్నెస్ ప్రోగ్రాంతో వైద్య సేవలు అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ న్యాయవాది మరియు జనసేన పార్టీ లీగల్ సెల్ సభ్యురాలు కరణం కళావతి ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. వారందరికి తాసుబెల్లి ఫౌండేషన్ తరుపున హృదయ పూర్వక అభినందనలు తెలియజేస్తున్నామని, అలాగే ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన ప్రతీ ఒక్కరికీ పేరు పేరునా హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు.