జనసేన ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం

ఉంగుటూరు నియోజకవర్గం, రాజకీయ పార్టీలు సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజా సేవలో నిమగ్నం కావడం హర్షించదగ్గ విషయం అని గ్రామ పెద్దలు ఇంటి బాబ్జీ అన్నారు. నిడమర్రు గ్రామంలో జనసేన నాయకులు మైలవరపు సురేంద్ర కుమార్ ఆధ్వర్యంలో మీనాక్షి ఐ ఆసుపత్రి గణపవరం వారి సహకారంతో డాక్టర్ హరినాథ్ రెడ్డి ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 150 మందికి కంటి పరీక్షలు చేసి కళ్ళ జోళ్లు అందించారు. అదే విధంగా కళ్ళ శస్త్ర చికిత్సలు అవసరమైన సుమారు 50 మందికి ఆపరేషన్లు రాజమండ్రి గౌతమి నేత్రాలయలో చేయించనున్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సేవలు అందించిన డాక్టర్ హరినాథ్ రెడ్డికి జనసేన నాయకులు శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు జనసేన నాయకులు వంగా రఘు, తోట పవన్, తానేటి నాగేశ్వరరావు, చిన్నం ఆనంద్, దూసనపూడి శ్రీను, దుసనపుడి ఉమా సురేష్, గౌతు వెంకన్న, తాతాజీ మరియు నందా తదితరులు పాల్గొన్నారు.