కళ్యాణదుర్గం ప్రజలకు మంచినీటి దాహం తీర్చిన జనసేన, టీడీపీ నాయకులు

కళ్యాణదుర్గం పట్టణ మున్సిపాలిటీలోని 12వ వార్డు, కమ్మన్ చెట్లవీధిలో మంచినీటి కొరత ఏర్పడడంతో స్థానిక ప్రజలు, ముఖ్యంగా మహిళలు, జనసేన నాయకుడు గంగరాజుని కలిసి తమ సమస్యను తెలియజేశారు. సమస్యను అర్థం చేసుకున్న గంగరాజు గారు వెంటనే టీడీపీ ముఖ్య నాయకులు, మాజీ మున్సిపల్ చైర్మన్ వై.పి. రమేష్ గారిని సంప్రదించి సమస్యను వివరించారు. దీనికి ఆయన తక్షణమే స్పందించి మంచినీటి ట్యాంకర్‌ను అందుబాటులోకి తెచ్చారు. జనసేన నాయకుడు గంగరాజు స్వయంగా మంచినీటి ట్యాంకర్‌ను తీసుకువెళ్లి 12వ వార్డు ప్రజలకు నీటి సరఫరా చేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, మహిళలు జనసేన మరియు టీడీపీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, జనసేన ఇంచార్జ్ బాల్యం రాజేష్, అడిగిన వెంటనే స్పందించి ట్యాంకర్ పంపించిన వాల్మీకి కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ & మాజీ మున్సిపల్ చైర్మన్ వై.పి. రమేష్, ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Share this content:

Post Comment