బందుకు సంపూర్ణ మద్దతు

ఏటూరునాగారం జనసేన పార్టీ మండల కొండగుర్ల వెంకీ (సాయి) జనసేన పార్టీ యూత్ లీడర్ ఇంచార్జీ మాట్లాడుతూ ఏటూరునాగారం బస్సు డిపో 35సంత్సరాల ఏజెన్సీ ప్రాంత వాసుల కల అని జనసేన నాయకులు అన్నారు. ఈరోజు ఏటూరునాగారంలో బస్సు డిపో వలన ఆర్టీసీకి అన్నివిధాలుగా ఆదాయం కూడా వస్తుందని అన్నారు. ములుగు జిల్లాకు గుండె కాయలాంటి మండలం ఏటూరునాగారం అని ఏటూరునాగారంలో చుట్టూ పక్కల మండలాలు అయిన మంగపేట, గోవిందరావు పేట, తాడ్వాయి, కన్నాయిగూడెం, వాజీడు, వెంకటాపురం మండలాలకు కేంద్రబిందువుగా మధ్యలో ఉన్నదని అన్నారు. ఇక్కడ బస్సు డిపో పునర్నిర్మాణం వలన ఆదివాసీ దళిత బహుజన వర్గాలవారికి బస్సు సౌకర్యంతో పాటు రోడ్లు రాకపోకలు మెరుగుపడి ప్రభుత్వాదాయం పెరుగుతుందని అన్నారు. అలాకాకుండా ఇతరరాష్ట్రాల రాకపోకల వలన బిజినెస్ లు కానీ ఇతర సంబంధాలు మెరుగుపడి అభివృద్ధి అయ్యే అవకాశం ఉంటుందని జనసేన నాయకులు అన్నారు. ఇప్పటికైనా తెరాస నాయకులు వాళ్ళ నాయకులతో ఒప్పించి బస్సు డిపో పునర్నిర్మాణం చేయించేలా మరియు జెడ్పిచైర్మన్ తో ఒప్పించి బస్సు డిపో పునర్నిర్మాణం అయ్యేలా తెరాస నాయకులు ప్రయత్నం చెయ్యాలని జనసేన నాయకులు అన్నారు. ఏటూరునాగారం బస్సు డిపో పునర్నిర్మాణం అయ్యేంత వరకు బస్సు డిపో గురించి ఎవ్వరు పోరాడిన ఉమ్మడి ఏటూరునాగారం మండలం జనసేన పార్టీ నాయకులు అన్నారు. గురువారం అఖిలపక్షం నాయకులు బస్సు డిపో సాధనసమితి ఇచ్చిన బందుకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని జనసేన నాయకులు పవన్, సంతోష్, వినయ్ అన్నారు.