దుర్గానగర్ లో భవన నిర్మాణ కార్మికుల భవిష్యత్ హామీ యాత్ర

కాకినాడ సిటి: జనసేన పార్టీ కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ సూచనలతో శనివారం భవన నిర్మాణ కార్మికుల భవిష్యత్ హామీ యాత్రా కార్యక్రమం టి.వి.వి. సత్యన్నారాయణ ఆధ్వర్యంలో 9వ డివిజన్ దుర్గానగర్ ప్రాంతంలో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ శ్రేణులు భవన నిర్మాణ కార్మికులతోను అక్కడున్న వారితో మాట్లాడి వారి కష్టసుఖాలపై వివరాలపై ఆరాతీసారు. అసలే చాలీ చాలని బతుకులనీ దానికి తోడు ఈ వై.సి.పి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకా ఇసుక దొరక్క, దొరికితే అత్యధిక ధరల వల్ల నిర్మాణ పనులు చాలా తక్కువగా ఉంటున్నాయనీ బతుకు చాలా భారమైందని కార్మికులు వాపోయారన్నారు. ఈ ముఖ్యమంత్రికి భవన నిర్మాణ కార్మికుల ఆకలి కేకలు వినపడవనీ ఎందుకంటే ఆయన ఆకాశంలో హెలీకాప్టర్ ఎగురుతుంటే కిందనుండీ వీళ్ళు ఎక్కడ కేకలేస్తారో అని బారికేడ్లు పెట్టి నియంత్రిస్తున్నారన్నారు. గోదావరీ పరివాహక ప్రాంతంలో ఉన్నాకూడా ఇలా ఇసుకకి కటకటలాడటం వై.సి.పి ప్రభుత్వ అరాచకమేనన్నారు. ఈ కార్యక్రమంలో రాజు, నాగేశ్వరరావు, తిరుపతి, కటారి శ్రీను, గుర్రం జాన్, జనసేన పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.