గంగవరం గ్రామంలో భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం
- భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న పయ్యావుల విజయ్ సింహ
ఉరవకొండ: బెలుగుప్ప మండలం, గంగవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భవిష్యత్తు గారింటి కార్యక్రమంలో ఉరవకొండ నియోజకవర్గ శాసనసభ్యులు పయ్యావుల కేశవ తనయుడు విజయ్ సింహ ప్రతి ఇంటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని అలాగే అభివృద్ధి తెలుగుదేశం జనసేన బిజెపి కూటమితోనే సాధ్యమని ప్రజలకు తెలియజేశారు. చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత పెన్షన్ 4000 రూపాయలు చేస్తారని అలాగే విద్యార్థులకు ఇంటిలో ఎంతమంది ఉంటారు కొంతమందికి 15000 అందిస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటు జనసేన పార్టీ మండల అధ్యక్షుడు కాసంశెట్టి సుధీర్, జేన్నె మధు, తిప్పయ్య, శేఖర్, రవి నాయక్, వైభవ్ జనసైనికులు పాల్గొన్నారు.