శీర్పీ గ్రామంలో భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం

నిడదవోలు: బెలుగుప్ప మండలం, శీర్పి గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సోమవారం చేపట్టిన భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో గ్రామంలోని ఇంటి ఇంటికీ పయ్యావుల కేశవ్ వారసుడు పయ్యావుల విక్రమసింహా ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిసి అధికారంలోకి రావడానికి ప్రజల ఆశీర్వాదం కావాలని, తెలుగుదేశం, జనసేన అధికారంలోకి వస్తే అభివృధి కార్యక్రమాల గురించి, సూపర్ సిక్స్ గురించి ప్రజలకు తెలియజేశారు. ఈ రాక్షస పాలన అంతమొందించి ప్రజల పాలనను తీసుకురావడమే తెలుగుదేశం – జనసేన పార్టీల లక్ష్యం అని విక్రమసింహ ప్రజలకు తెలియజేశారు. భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమానికి జనసేన పార్టీ నాయకులు సంఘీభావం తెలిపారు. జనసేన పార్టీ బెలుగుప్ప మండల అధ్యక్షుడు కాశంశెట్టి సుధీర్, జనసేన నాయకులు శేఖర్, రుద్రస్వామి నాయక్ తదితరులు పాల్గొన్నారు.