రామచంద్రాపురం మండలంలో గడప – గడపకు జనసేన కార్యక్రమం

చిత్తూరు జిల్లా అధ్యక్షులు శ్రీ పసుపులేటి హరిప్రసాద్ సూచనలు మేరకు జిల్లా కార్యదర్శి శ్రీ దేవర మనోహర గడప – గడపకు జనసేనలో భాగంగా చంద్రగిరి నియోజకవర్గం, రామచంద్రాపురం మండల పర్యటనలో భాగంగా మండల నాయకులు మరియు జనసైనికుల సమక్షంలో డా.భి.ఆర్ అంబేద్కర్ కి నివాళులు అర్పించి, ఆయన ఆశయాలను శ్రీ పవన్ కళ్యాణ్ రూపంలో ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి సుభాషిణి, మండల అధ్యక్షులు సంజీవి హరి, కిరణ్, వాసు, మురళి, పవన్, ఢిల్లీ మరియు కే.సి పేట, రామాపురం జనసైనికులు పాల్గొనడం జరిగింది.