గాదె వెంకటేశ్వరరావుతో పొన్నూరు యువత మర్యాదపూర్వక బేటీ

గుంటూరు: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆశయాలకు, ఉద్యమాలకు ఆకర్షితులై పొన్నూరు ప్రాంతానికి చెందిన యువకులు యన్నం నాయుడు ఆధ్వర్యంలో.. గుంటూరు జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావును కలిసి పుష్పగుచ్చాలును అందించి.. దుశ్శాలవతో సన్మానం చేశారు. అనంతరం గాదె మాట్లాడుతూ పార్టీ ఆశయాలకు అనుగుణంగా యువకులు పనిచేసి పట్టణ గ్రామస్థాయిలో జనసేన పార్టీని పటిష్టం చేయాలని సూచించారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో యన్నం నాయుడు, తోట నాగరాజు, వైజయ్ యూత్ గోపికృష్ణ, ఎం. చంద్రకాంత్, తోట సురేష్, పెదబాబు ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు జన సైనికులు తదితరులు పాల్గొన్నారు.