గజపతినగరం జనసేన ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం
గజపతినగరం నియోజకవర్గం: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వారోత్సవాల్లో భాగంగా, మూడవరోజు మెగా రక్తదాన శిబిరాన్ని గజపతినగరం నియోజకవర్గ నాయకులు మరాపు సురేష్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఎన్. వి.ఎన్ బ్లడ్ బ్యాంక్ (నాగేశ్వరరావు) వారిచే ఏర్పాటు చేయడం జరిగింది, ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ అన్నిదానాల్లో కన్నా రక్తదానం మహాగొప్ప దానమని, ప్రేమే లక్ష్యం, సేవేమార్గం అనే సిద్ధాంతాన్ని అలవర్చుకున్న సేవకు ప్రతిరూపమైన నాయకులు బాటలోనే జనసైనికులు నడవాలని, ఇటువంటి రక్తదాన చేయటం సమాజానికి ఎంతోమందికి ఆదర్శమని అన్నారు. ఆశయాలను ప్రజల్లో తీసుకెళ్లే విధంగా జనసైనికులు అందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు డా.రవి కుమార్ మీడతాన, గజపతినగరం నాయకులు, పండు, మహేష్, శ్రీను, ఆదినారాయణ, శంకర్, లక్ష్మణ, అనిల్, చరణ్, భాను, సురేష్, వెంకట్, రాంబాబు ఐదు మండలాల నుంచి జనసైనికులు, నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-29-at-1.35.29-PM-1024x486.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-29-at-1.35.29-PM-1-1024x832.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-29-at-1.35.30-PM-1024x460.jpeg)