పదవ తరగతి ఉత్తీర్ణులకి అభినందనలు తెలిపిన గంధం ఆనంద్

ఉమ్మడి ఖమ్మం జిల్లా, గురువారం విడుదలైన పదవ తరగతి పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత పొందిన విద్యార్థిని, విద్యార్థులకు ఉమ్మడి ఖమ్మం జిల్లా జనసేన పార్టీ విద్యార్థి విభాగ కార్యనిర్వహక సభ్యుడు గంధం ఆనంద్ హృదయపూర్వక అభినందనల శుభాకాంక్షలు తెలియజేశారు. అదే విధంగా కొద్ది మార్కులతో ఫెయిల్ అయిన విద్యార్థినీ, విద్యార్థులు భవిష్యత్తులో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని దీవించారు. అంతే కాకుండా విద్యార్థి సమస్యల పట్ల జనసేన పార్టీ విద్యార్థి విభాగం ముందు ఉండి సమస్యల పరిష్కారం చేస్తుంది అని తెలియజేస్తున్నాను. ఓటమితో కుంగిపోవద్దు రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగాలని ప్రతి ఒక్క విద్యార్థికి తెలియజేస్తున్నాను. అంతే కాకుండా ఫెయిల్ అయ్యామని చదువును ఆపకండి మీకు ఉన్న నాలెడ్జ్ తో మంచిగా, కృషి, పట్టుదలతో కష్టపడి చదువుకొని మంచి ఫలితాలు సాధించాలి అని కోరుతున్నానని తెలిపారు.