గాంధీజీ ఆశయాలైన శాంతి, అహింస, సమానత్వం నేటి యువతకు స్ఫూర్తి : కామిశెట్టి రమేష్

గురజాల, జాతిపిత స్వాతంత్ర్య ఉద్యమ సూర్తి ప్రదాత గాంధీజీ జయంతి వేడుకలను జనసేన పార్టీ పిడుగురాళ్ల అధ్యక్షుడు కామిశెట్టి రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ఐలాండ్ సెంటర్లో జాతిపిత గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. శాంతి సమానత్వం అనే సిద్దాంతంతో దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన గొప్ప వ్యక్తి గాంధీజీ అని రమేష్ కొనియాడారు. ప్రపంచ శాంతి స్థాపనకు కృషి చేసిన వ్యక్తి మహాత్మాగాంధీ అని, ఆయన స్ఫూర్తితో మా అధినాయకుడు ముందుకు వెళ్తున్నారని, అదే బాటలో మేము కూడా పయనిస్తున్నామని జిల్లా సంయుక్తంగా కార్యదర్శి దూదేకుల కాశిం సైదా అన్నారు. విదేశి వద్దు స్వదేశీ ముద్దు అంటూ చేనేత వస్త్రాలకు ప్రాచుర్యం కల్పించిన గొప్ప వ్యక్తి బాపూజి అని ఆయన స్ఫూర్తిగా అందరూ ముందుకు వెళ్ళాలని మండల ప్రధాన కార్యదర్శి చీదెళ్ళ రామకృష్ణ చెప్పారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఐటీ కోఆర్డినేటర్ మునగా వెంకట్, ఉపాధ్యక్షుడు బయ్వవరపు రమేష్, పెడకొలిమి కిరణ్, మండల ప్రధాన కార్యదర్శి గుర్రం కోటేశ్వరరావు, కార్యవర్గ సభ్యులు, షేక్ అబ్దుల్ గపూర్, గద్దెబోయిన సతీష్ గుడి రత్తయ్య, నాయకులు బేతంచర్ల రామారావు, కామిశెట్టి నరసయ్య, కామిశెట్టి ఆదిత్య, అబిశెట్టి ఆంజనేయులు, ఇతర జనసైనికులు పాల్గొన్నారు.