జనసేన, టీడీపీ సమన్వయ కమిటీ ఇంచార్జ్ గా గంగారపు

మదనపల్లె: జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రజల తరుపున పోరాటం చేయడానికి నియోజకవర్గ స్థాయి జనసేన టీడీపీ సమన్వయ కమిటీ ఇంచార్జ్ గా రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రాందాస్ చౌదరిని నియమించినందుకు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి గంగారపు రాందాస్ చౌదరి కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ సందర్భంగా రాందాస్ చౌదరి మాట్లాడుతూ ఈ రాక్షస పాలనను, జగణాసురున్ని ఎదుర్కోవాలంటే తెలుగుదేశం పార్టీ నాయకులతో కార్యకర్తలతో, మదనపల్లి నియోజకవర్గం జనసేనికులు వీరమహిళలలు అందరూ కలిసి ఐకమత్యంగా కార్యక్రమాలు చేయాలనీ అన్నారు. ఇంటింటా తిరిగి మన నాయకుడు పవన్ కళ్యాణ్, నారా చంద్రబాబు నాయుడు కలసి ఉమ్మడి మేనిఫెస్టో ని గడప గడపకి తీసుకొని వెళ్లాలని పిలునిచ్చారు. అలాగే ఓటర్ల జాబితాలో జరిగిన అవక తవకలని గుర్తించి వాటిని మీడియా దృష్టికి ప్రభుత్వం దృష్టికి, ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొని వెళ్లాసిన గురుతర బాధ్యత జనసైనికులకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగల శివరామ్, లవన్న పాల్గొన్నారు.