అంగన్వాడీలకు మద్దతు తెలిపిన గంగారపు రామదాస్ చౌదరి

మదనపల్లె, గత 23 రోజులుగా తమ న్యాయమైన డిమాండ్ లను నెరవేర్చాలని శాంతి యుతంగా నిరసన వ్యక్తం చేస్తు కలెక్టరేట్ కి ర్యాలీగా వెళ్లి కలెక్టర్ కి విన్నవించెందుకు బయలుదేరి వెళుతున్న అంగన్వాడీ కార్యకర్తలను బుధవారం ఉదయం తాలూకా పోలీసులు అరెస్ట్ చేసి నిర్భందించడం జరిగిందని అంగన్వాడీ కార్యకర్తలకి సంపూర్ణ మద్ధతు జనసేన పార్టీ రాయలసీమ కో-కన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి మరియు జనసేన నాయకులు కార్యకర్తలు వీరామహిళలతో కలసి పరామర్శించి వారికీ అండగా జనసేన పార్టీ ఉంటుందని రాయలసీమ కో-కన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి భరోసా ఇచ్చారు. ఈ విషయాలు అన్నింటిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొని వెళ్తామని, రాబోయే ఎన్నికల్లో జనసేన టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయగానే అంగన్వాడీ కార్యకర్తల డిమాండ్ లను తీర్చే విధంగా కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం, రాష్ట్ర చేనేత ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర, పట్టణ అధ్యక్షులు నాయని జగదీష్, పట్టణ ప్రధాన కార్యదర్శి కావలి రెడ్డెమ్మ, రూరల్ ఉపాధ్యక్షులు చంద్రశేఖర్, పట్టణ ప్రధాన కార్యదర్శి నవాజ్, లవన్న, పట్టణ ఉపాధ్యక్షులు పురం నగేష్, గంగులప్ప, జెనరల్ సెక్రటరీ పవన్ శంకర, పట్టణ జనరల్ సెక్రటరీ జవిలి మోహన్ కృష్ణ, జెస్వంత్ తదితరులు పాల్గొన్నారు.