గొల్లపల్లిలో గంగారపు రాందాస్ చౌదరి పర్యటన
మదనపల్లి నియోజకవర్గం: రామసముద్రం మండలం, మూగవాడి పంచాయతీ పరిదిలోని గొల్లపల్లిలో జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రాందాస్ చౌదరి పర్యటించారు. ఈ సందర్భంగా గొల్లపల్లి జనసేన యువత రాందాస్ చౌదరికి ఘన స్వాగతం పలికారు. అనంతరం గంగారపు రాందాస్ చౌదరి ఆధ్వర్యంలో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ చేసి తరువాత గొల్లపల్లిలో ఇంటి ఇంటికి తిరిగి జనసేన కరపత్రాలు ఇస్తూ, వారి సమస్యలను అడిగి తెలుసుకొని వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది జనసేన ప్రభుత్వమని అధికారంలోకి రాగానే మీ సమస్యలన్నింటికి పరిష్కారం దొరుకుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం రాయల్, జిల్లా జాయింట్ సెక్రటరీ సనా ఉల్లా, రామసముద్రం మండలం అధ్యక్షులు చంద్రశేఖర్, వైస్ ప్రెసిడెంట్ గడ్డం లక్ష్మీపతి, జనరల్ సెక్రటరీ విశ్వనాధ్, రెడ్డెమ్మ, గజ్జల రెడ్డెప్ప, నవాజ్, సురేష్, గంగరాజు, లక్ష్మి నారాయణ, శ్రవణ్, రోహిత్, గణేష్, ఆఫ్జాల్ తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-11-at-5.47.52-PM-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-11-at-5.47.53-PM-1024x580.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-11-at-5.47.53-PM-1-1024x580.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-11-at-5.47.53-PM-2-1024x580.jpeg)