గంగారపు రాందాస్ చౌదరి ఆధ్వర్యంలో జనంతో “టీ” జనసేన

మదనపల్లె నియోజకవర్గం: మదనపల్లెలోని స్థానిక చిత్తూరు బస్టాండ్ దగ్గర, దినసరి కూరగాయల మార్కెట్ దగ్గర జనంతో టీ జనసేన కార్యక్రమం జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రాందాస్ చౌదరి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యణ్ గారి సిద్ధాంతాలను, నినాదాలని ప్రజల్లోకి తీసుకువెళ్తుంటే ప్రజల్లో అనూహ్య స్పందన రావటం చాలా సంతోషంగా ఉందన్నారు. వైసీపీ విముక్తా ఆంధ్రప్రదేశ్ అనే నినాదాన్ని ప్రజల్లోకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉభయగోదావరి జిల్లాలలో వారహి యాత్ర చేస్తా ఉంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఓర్వలేక దమ్ము లేక ధైర్యం లేక వైసీపీ పేటియమ్ బ్యాచ్ లను జనసైనికుల మీద వదులుతున్నారన్నారు. తల్లి, చెల్లికి న్యాయం చేయలేని ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకు న్యాయం చేస్తాడా..?. సొంత కుటుంబానికి తీవ్ర అన్యాయం చేసిన వైఎస్.జగన్ రాష్ట్రానికి ఏమి చేయలేదని తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చేనేత విభాగ నాయకులు అడపా సురేంద్ర, మదనపల్లి రూరల్ మండల అధ్యక్షులు గ్రానైట్ బాబు, గడ్డం లక్ష్మిపతి, సనా ఉల్లా, కుమార్, నగేష్, గజ్జల రెడ్డెప్ప, నాగ, నవాజ్, వేణు, సత్య, సన్నీ తదితరులు పాల్గొన్నారు.