వారహి యాత్ర పోస్టర్ ని అవిష్కరించిన గంగారపు రామదాసు చౌదరి

మదనపల్లె: జూన్ 11వ తేదీన రాష్ట్ర కార్యాలయం మంగళగిరిలో సంస్థ దేవతలకి యాగం, హోమం నిర్వహించిన తర్వాత 14వ తేదీన ఉభయగోదావరి ఉమ్మడి జిల్లాలో సత్యదేవుని సమక్షంలో ఆశీస్సులు తీసుకొని వైసీపీ విముక్త ఆంధ్ర ప్రదేశ్ అనే నినాదంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో మొత్తం 175 నియోజకవర్గాలు కలియ తిరుగుతూ.. ఈ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు సమర శంఖాన్ని పూరించబోతున్న శుభ సందర్భంలో మదనపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో రాయలసీమ కోకన్వీనర్ గంగారపు రామదాసు చౌదరి ఆధ్వర్యంలో జనసేన వారహి యాత్ర పోస్టర్ ని ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మదనపల్లి నుంచి పదిమంది వాలంటీర్లు వారహి యాత్రలో పాల్గొనడానికి వెళ్తున్నారు. 12,13,14 తారీకుల్లో మదనపల్లి నుండి వెళ్లి అక్కడ పవన్ కళ్యాణ్ గారి కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుందని పేర్కొన్నారు. అలాగే మదనపల్లి నియోజకవర్గంలో ఈ వైసీపీ ప్రభుత్వం నాయకులు మంత్రి గారు, ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు మన మదనపల్లికి చేసిన అన్యాయాన్ని వాడవాడలా గడపకి తీసుకుపోయి వైసీపీ విముక్త మదనపల్లి ద్యేయంగా పనిచేస్తామని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం రాయల్, ఐటీ విభాగ నాయకులు జగదీష్, మదనపల్లి రూలర్ అధ్యక్షులు గ్రానైట్ బాబు, కుమార్, జనార్దన్, హరికృష్ణ, రెడ్డప్ప, నవాజ్, శేఖర, శంకర, అక్షయ్, సాయి తదితరులు పాల్గొన్నారు.