ఏజెన్సీ ప్రజలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం మీద అవగాహన కల్పిస్తున్న గర్భాన

సీతంపేట మండలంలో మంగళవారం పాలకొండ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు గర్భాన సత్తిబాబు జక్ర వలస, నారాయణగూడ, మండ ఏజెన్సీ గ్రామంలో జన సైనికులకు ప్రజలకు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం మీద అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసైనికులు యొక్క సంక్షేమం కోసమే అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పెద్ద మనసుతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, అలాగే జనసేన ప్రభుత్వం స్థాపించిన రోజున ఏజెన్సీ ట్రైబల్స్ ని అభివృద్ధి చేస్తారని ఆయన అన్నారు. జనసైనికులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.