జనసేన పార్టీ విస్తృత సమావేశాలలో పాల్గొన్న గర్భన సత్తిబాబు

పాలకొండ: ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్న జనసేన పార్టీ విస్తృత సమావేశంలో భాగంగా సోమవారం స్థానిక సన్ రైజ్ హోటల్లో పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మరియు పలువురు ముఖ్యనాయకుల సమక్షంలో.. పాలకొండ నియోజకవర్గం జనసేన పార్టీ నేతలతో చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గ నాయకులు గర్భన సత్తిబాబు మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ముఖ్యంగా తోటపల్లి ఎడమ కాలువ, జంపర్ కోట జలాశయం పూర్తి అయితే ఈ ప్రాంతం మరో కోనసీమ జిల్లాగా తయారవుతుందని సత్తిబాబు అన్నారు. పాలకొండ డంపింగ్ యాడ్, పాలకొండ రాజాం రహదారి మరియు నియోజకవర్గంలో ఉన్న పలు సమస్యలను పార్టీ దృష్టికి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాలుగు మండలాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.