శంభాం ఏజెన్సీ గ్రామంలో పర్యటించిన గర్భాన సత్తిబాబు

సీతంపేట మండలం, శంభాం ఏజెన్సీ గ్రామంలో గురువారం పాలకొండ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు గర్భాన సత్తిబాబు పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామ జనసైనికులతో ఆయన మాట్లాడుతూ.. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన రైతు భరోసా యాత్రలో భాగంగా ఆత్మహత్య చేసుకున్నటువంటి 3000 మంది కౌల రైతు కుటుంబాలకు లక్ష రూపాయలు ప్రకటించారని తెలియచేస్తూ.. రైతాంగానికి అండగా నిలుస్తున్న పవన్ కళ్యాణ్ గారు పెద్ద మనసుతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని.. అలాగే ఏజెన్సీ ట్రైబల్స్ ఏరియా జనసేన పార్టీ తోనే అభివృద్ధి సాధ్యం అని. జనసేన పార్టీ ప్రభుత్వం స్థాపించే వరకూ ప్రతి ఒక్క జనసైనికుడు కృషి చేయాలని కోరారు.