అగ్నిప్రమాద బాదితులకు అండగా నిలచిన గెడ్డం బుజ్జి

అనకాపల్లి జిల్లా, పాయకరావుపేట మండలం, పాలమానపేట పంచాయితీ కొర్లయ్యపేట గ్రామంలో సూరాడ రాంబాబు భార్య సూరాడ కొండమ్మ ఇంటిలో వంట గ్యాస్ మంటలు రేగడంతో ఇల్లు పూర్తిగా కాలిపోయింది. ఈ విషయాన్ని స్థానిక జనసైనికులు పాయకరావుపేట నియోజకవర్గం నాయకులు గెడ్డం బుజ్జి దృష్టికి తీసుకువెళ్లడంతో.. విషయం తెలుసుకున్న బుజ్జి సంఘటనా స్థలానికి వెళ్లి బాధితులను పరామర్శించి వారికి బియ్యం, నిత్యవసర సరుకులు, 5000 రూ. నగదు అందచేశారు. అలాగే తాను మరియు జనసేన పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు జగ్గం దొర, రాజు, ముత్తి రమణ, వంక శివ జనసైనికులు సూరడ నల్ల బాబు, అప్పలరాజు, జగన్నాథం, సూరిబాబు, సింహాచలం, రాజు, జనసైనికులు పాల్గొన్నారు.