రాజానగరం నియోజకవర్గ జనసేన శ్రేణుల విస్తృత సమావేశం
రాజానగరం నియోజకవర్గ జనసేన శ్రేణుల విస్తృత స్థాయి సమావేశం రాజానగరం మండలం సూర్యారావు పేట నందు బ్రహ్మాండంగా జరిగింది. రాజానగరం మండల జనసైనికుల కోలాహలంతో సమావేశం రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ నాయకత్వంలో మునుపెన్నడూ లేని విధంగా భారీ స్థాయిలో జరిగింది. ఈ సదర్భంగా బత్తుల మాట్లాడుతూ.. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై, జనసైనికుల మధ్య ఉన్న సత్సంబంధాలపై, అధికార పార్టీ నేతలు, స్థానిక ఎమ్మెల్యే చేస్తున్న దాష్టికత్వాన్ని నిలదీస్తూ రాజానగరం నియోజకవర్గంలో బత్తుల బలరామకృష్ణ చేపట్టబోయే భవిష్యత్తు కార్యాచరణ మొదలగు అంశాలపై ఈ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-22-at-22.50.12-1-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-22-at-22.50.13-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-22-at-22.50.12-2-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-22-at-22.50.15-1024x768.jpeg)