మంగినాయన పల్లిలో జనసేన పార్టీ విస్తృత సమావేశం

తిరుపతి: పాకాల మండలం, దామలచెరువు గ్రామం, మంగినాయన పల్లెలో మంగళవారం కాపు సంక్షేమ సేన రైతు విభాగం తిరుపతి జిల్లా అధ్యక్షులు మరియు జనసేన నాయకులు రమేష్ మారసాని స్థానిక యువకులతో కలిసి వారి అభిప్రాయాలు తెలుసుకొని 2024లో పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చేసేదిశగా పల్లె పల్లెలో ప్రతి ఒక్కరు పనిచేయాలని కోరగా, యువకులు నెలకు రెండు రోజులు జనసేన పార్టీ కోసం మేము పనిచేస్తాము అని ముందుకు వచ్చి చెప్పడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రం మొత్తం యువకులు జనసేన పార్టీ కోసం పనిచేయాలని మంగ నాయన పల్లి జనసేన పార్టీ విస్తృత సమావేశంలో నిర్ణయించడం జరిగింది. ఈ సమావేశంలో రమేష్ మారసాని, శివ గుర్రంకొండ, పవన్ బండారు, గౌతమ్, సాయి, గిరిబాబు, రెడ్డి బాబు, బాలకృష్ణ, సునీల్, నాగేంద్రబాబు, ఉదయ్ కిరణ్, శివ, లక్ష్మీపతి మరియు వెంకటేష్ అనే యువకులందరూ పాల్గొని పవన్ వెంట మేము చెప్పడం జరిగింది.