వేసవి తాపం నుండి ఉపశమనం పొందండి: త్యాడ రామకృష్ణారావు

విజయనగరం: ఒక్కసారిగా రాష్ట్రంలో ఎండలు విపరీతంగా పెరగడంతో, విజయనగరంలో 42వ డివిజన్, కామాక్షినగర్లో జనసేన పార్టీ సీనియర్ నాయకులు, విజయనగరం జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు త్యాడ రామకృష్ణారావు(బాలు) మజ్జిగ చలివేంద్రాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర విపత్తుల శాఖ ఈ నెలాఖరు వరకూ ఎండలు ఎక్కువగా ఉంటాయని హెచ్చరించటంతో ప్రజలందరూ బయటకు వచ్చేటప్పుడు వేసవి జాగ్రత్తలు తీసుకోవాలని, అలాగే ఎక్కువగా మంచినీటితో పాటు, మజ్జిగ, పండ్ల రసాలు, నిమ్మరసం వంటి పానీయాలు తాగి వేసవినుంచి ఉపశమనం పొందాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు రవిరాజ్ చౌదరి, ఎర్నాగుల చక్రవర్తి, 42వ డివిజన్ నాయకులు, వై. నల్లమరాజు, కనితి సురేష్, అప్పలనాయుడు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.