ఘనంగా తుంగభద్ర పుష్కరాలు.. గంగా హారతి కార్యక్రమం..

పవిత్ర తుంగభద్ర నదీ పుష్కరాలు ఐదవ రోజుకు చేరుకున్నాయి. మహబూబ్‌నగర్‌ జిల్లా అలంపూర్‌లో పుష్కరాలు ఘనంగా కొనసాగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు నదీ స్నానాలు ఆచరిస్తున్నారు. దేశంలోనే ఐదో శక్తిపీఠం జోగులాంబ అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఇక్కడి ఘాట్‌కు తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్‌ నుంచి భక్తులు వచ్చి పుష్కర స్నానం అచరిస్తున్నారు. నిన్న నాలుగోవరోజు కార్తీక సోమవారం కావడం భక్తులు పొటెత్తారు.

తెల్లవారుజామునే నదిలో స్నానం చేసి కార్తీక దీపారాధనలో భక్తులు అమ్మవారిని కొలుస్తున్నారు. సాయంత్రం ఆలయ అర్చకులు తుంగభద్ర నదికి గంగా హారతి కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే అబ్రహం దంపతులతోపాటు ఆలయకమిటీ చైర్మన్ రవికుమార్ గౌడ్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.