అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేద్దాం

  • జనసేనపార్టీ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

అనంతపురం జిల్లా, శింగనమల నియోజకవర్గం నార్పల మరియు బుక్కరాయసముద్రం మండలాలల్లో భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా జనసేన పార్టీ రాయలసీమ మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాలు శ్రీమతి పెండ్యాల శ్రీలత జిల్లా నాయకులు పెండ్యాల హరి, నియోజకవర్గ నాయకులు దంపెట్ల శివ ల ఆధ్వర్యంలో జయంతి వేడుకలను నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా నార్పల మరియు బుక్కరాయసముద్రం మండలంలో బస్టాండ్ కూడలి నుండి అంబేద్కర్ విగ్రహం వరకు డప్పు కళాకారుల ప్రదర్శనతో ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా రాయలసీమ మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాలు పెండ్యాల శ్రీలత పాత్రికేయులతో మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాల సాధన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తోనే సాధ్యమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు కాశెట్టి సంజీవ రాయుడు, చొప్పా చంద్రశేఖర్, నార్పల మండల అధ్యక్షులు గంజి కుంట రామకృష్ణ, బుక్కరాయసముద్రం మండల అధ్యక్షులు ఎర్రి స్వామి, అనంతపురం నగర ప్రధాన కార్యదర్శి పెండ్యాల చక్రపాణి, నగర కార్యదర్శి అంజి, వీరమహిళలు కాశెట్టి సావిత్రి, గుమ్మడి సాని శిల్ప, తేజ లక్ష్మి, నాగమల్లిక నాయకులు కొండిశెట్టి ప్రవీణ్ కుమార్, తోట ప్రకాష్, భాస్కర్, విశ్వనాథ్ రెడ్డి, కుల్లాయప్ప, రమణ,మహేంద్ర, నారాయణస్వామి, రామయ్య, షఫీ, ఆన్సర్, దాదా, పృథ్వి, గిరీష్, ప్రదీప్, నాగేంద్ర , సుమన్, ఓబిలేసు, అశోక్, రామకృష్ణ, చరణ్, తాహిర్, వంశీ, హుస్సేన్ భాష, సిద్ధూ, రామాంజి తదితరులు పాల్గొనడం జరిగింది.