ఆక్సిడెంట్ బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చిన గంటా స్వరూప

రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం శ్రీరంగపట్నం కళాకారుల బృందానికి జరిగిన ఆక్సిడెంట్ బాధితులను రెండవ రోజు పరామర్శించిన రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి గంటా స్వరూప దేవి. హాస్పిటల్ ఎండీ అయిన డాక్టర్ విజయ్ కుమార్ తో మాట్లాడి పేషంట్స్ కండిషన్ తెలుసుకున్నారు. నియోజకవర్గ ఇంచార్జ్ మేడా గురుదత్ ఆదేశాల ప్రకారం పేషంట్స్ అందరినీ మరొక్కసారి కలిసి వాళ్ళకి ధైర్యం చెప్పి కుటుంబ సభ్యులకి జనసేన పార్టీ తరపున అండగా ఉంటామని తెలియచేశారు.