శ్రీ నేరెళ్ళమ్మ అమ్మవారి ఆలయానికి డాక్టర్ పిల్లా శ్రీధర్ సౌండ్ సిస్టం బహుకరణ

పిఠాపురం నియోజకవర్గం, ఉప్పాడ కొత్తపల్లి మండలం, కొత్తపట్నం ఉప్పడ పంచాయతీ అగ్నికుల క్షత్రియుల కాలనీ నందు తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీవాణి ట్రస్ట్ వారి ఆర్థిక సహకారంతో సమరసత సేవా ఫౌండేషన్ నిర్మాణం చేసిన దేవాలయమునకు కమిటీ వారి కోరిక మేరకు పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ శ్రీ నేరెళ్ళమ్మ అమ్మవారి ఆలయానికి సౌండ్ సిస్టంను బహుకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర మత్స్కర నాయకులు కంబల దాసు, మచ్చ శ్రీనివాస్, బండి వాసుబాబు, కంద చక్రబాబు, పల్లెటి నాగేష్, సోది రవికిరణ్, పల్లెటి జాన్సన్, కాట్లు రాజు, కొత్తపల్లి రాజు, పలివెల్ల నాని, బండి రవి కిరణ్, పెనుపోతుల వీరబాబు, మెరుగు రవి, రవి, పట్టా దేశీయ మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.