గిరిసేన జనసేన – జనం వద్దకు జనసేన 18వ రోజు

పార్వతీపురం మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గం, జనసేన పార్టీ ఆధ్వర్యంలో గిరిసేన జనసేన – జనం వద్దకు జనసేన 18వ రోజు, వీరఘట్టం మండల నరిసిపురం పంచాయతీ పరిధిలోని గిరిజన యువతకి క్రియాశీలక సభ్యత్వ కిట్లు పంపిణీ చేశారు. అనంతరం అక్కడ ఉన్న యువత, ప్రజలతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్న వీరఘట్టం జనసేన పార్టీ నాయకులు. జనసేన జాని మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్ళాలని గిరిజన యువతకు దిశా నిర్దేశం చేసారు. బి.పి.నాయుడు జనసేన పార్టీలో యువతకు అత్యధిక ప్రాధాన్యత ఉంటుందని జనసేన పార్టీ విధివిధానాలు, మ్యానిఫెస్టోలోని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడంతో పాటు, వైసీపీ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. మత్స పుండరీకం మాట్లాడుతూ యువతకు ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఉజ్వల భవిష్యత్తు ఉన్న యువత వైసిపి ప్రభుత్వం పరిపాలనలో నిర్వీర్యం అయిపోతోందని, ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, పరిశ్రమల స్థాపన లేకపోవడంతో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కనుమరుగయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. యువతకు ఉజ్వలమైన భవిష్యత్తు కల్పించాలంటే, చిత్తశుద్ధి కలిగిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తోనే సాధ్యం అవుతుందని, అలాంటి పవన్ కళ్యాణ్ కి యువత అంతా బాసటగా నిలవాలని సూచించారు. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులు, కార్యకర్తలు స్థానిక సమస్యలపై స్పందిస్తూ, వాటి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. కర్ణేన సాయి పవన్ మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మార్గంలో పయనించి ప్రజా ప్రభుత్వం తీసుకురావాలని, అలాగే పన్నుల బాదుడుతో ప్రజలను అష్టకష్టాలు పెడుతున్న వైసీపీ ప్రభుత్వాని గద్దె దించాలని, రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో క్రియాశీలక సభ్యులు చింత గోవర్ధన్, దత్తి గోపాలకృష్ణ, కలిపిల్లి సింహచలం, దూసి ప్రణీత్, కంటు మురళి, వావిలపల్లి నాగభూషణ, అన్ను రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.