నెల్లూరు, కార్పొరేషన్ కార్యాలయంలో డ్రైవరుగా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం మృతి చెందడం బాధాకరమని జనసేన పార్టీ సీనియర్ నేత నూనె మల్లికార్జునయాదవ్ అన్నారు. ఈ మేరకు ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ సూచనలతో మంగళవారం కమిషనర్ సూర్య తేజని కలిసి సుబ్రమణ్యం భార్యకు ఉద్యోగం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుబ్రహ్మణ్యం విషయంలో కమిషనర్ ప్రత్యేక చొరవ చూపాలని కోరారు. ఆయన కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని తెలిపారు. ఈ విషయంపై కమిషనర్ స్పందించి తగిన సాయం చేస్తాము అన్నారు. ఈ కార్యక్రమంలో సుందరరామిరెడ్డి, అనుదీప్, ఖరీం, మనోజ్, జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Share this content:
Post Comment