జనసేనకు ఒక అవకాశం ఇవ్వండి మర్రెడ్డి శ్రీనివాస్
అనపర్తి, “జనంకోసం పవన్ పవన్ వెంట మనం” కార్యక్రమాన్ని అనపర్తి నియోజకవర్గం జనసేన ఇంఛార్జి మర్రెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా పెదపూడి మండలం పుట్టకొండ గ్రామంలో నిర్వహించారు. ముందుగా పుట్టకొండ లక్ష్మి నరసింహ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పెదపూడి మండలం నుండి సుమారు 30 మంది యువకులు, నాయకులు జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. వారికి మర్రెడ్డి శ్రీనివాస్ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఇంటింటికీ వెళ్లి కరపత్రాలను పంచుతూ రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కి ఓటు వేసి అవకాశం కల్పించాలని కోరారు. ఈ సంధర్బంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ఇంటింటికీ జనసేన పవన్ వెంట మనం కార్యక్రమం ద్వారా నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళి వారి సమస్యలను తెలుసుకుని జనసేనకి మద్దతు ఇవ్వాలని కోరుతున్నాను. మొదటి రోజు సందర్భంగా లక్ష్మి నరసింహ స్వామీ ఆలయంలో పూజలు నిర్వహించి ప్రారంభించామని రాబోయే ఎన్నికల్లో జనసేన విజకేతనం ఎగుర వేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గం సమన్వయకర్త ఆర్ నాగు. పెదపూడి మండల అధ్యక్షులు నాగిరెడ్డి వీరాస్వామి, జనసేన వీర మహిళ పాటంశెట్టి కాశీరాణీ, బిక్కవోలు మండల అధ్యక్షులు వీరబాబు, రంగంపేట మండల అధ్యక్షులు గిరజల సత్తిబాబు, అనపర్తి మండలం అధ్యక్షులు ప్రసాద్ రెడ్డి, జనసేన రామేశ్వరం పంచాయితీ వార్డు మెంబర్ కుమారి, యనాల కొండయ్య, యాడ్లపల్లి వీరసాయి, ఫణి, మట్ట రాజు, సుంకర బుజ్జి, పెద్ద ఎత్తున జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/03/WhatsApp-Image-2023-03-26-at-13.30.37-1024x576.jpeg)