మార్పుకు శ్రీకారం చుట్టి జనసేనకి ఒక అవకాశం ఇవ్వండి: బత్తుల
◆ జవాబుదారీతనంతో కూడిన సరికొత్త రాజకీయ వ్యవస్థ కోసం పవన్ కళ్యాణ్ కి ఒక అవకాశం ఇవ్వాలని పిలుపు
◆ అగ్రహారం పెద్దల మద్దత్తు ఈసారి జనసేన పార్టీకే
◆ ‘మహపాదయాత్ర’కు సంఘీభావం తెలిపిన పలువురు పురోహితులు, మహిళలు
◆ బ్రాహ్మణుల పలు సమస్యలను ఈ అరాచక ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసింది. జనసేన ప్రభత్వంలో వారికి తప్పక న్యాయం చేస్తాం – బత్తుల హామీ
రాజానగరం, “జనంకోసం జనసేన – మహాపాదయాత్ర” 63వ రోజులో భాగంగా కోరుకొండ మండలం, కోరుకొండ అగ్రహారంలో రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా బత్తుల వెంకటలక్ష్మి మాట్లాడుతూ… ఈసారి జనసేన పార్టీకి ఓటు వేసి, పవన్ కళ్యాణ్ లాంటి ఒక నిజాయితీపరుడికి ఒక అవకాశం ఇచ్చి మార్పుకు శ్రీకారం చుట్టాలని, అప్పుడే వ్యవస్థ ప్రక్షాళన జరిగి, జవాబుదారీతనంతో కూడిన సరికొత్త రాజకీయ వ్యవస్థ వచ్చి భావితరాల భవిష్యత్తు బాగుంటుందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని పలువురికి క్లుప్తంగా వివరించడం జరిగింది. వారు కూడా ఈసారి తమ పూర్తి మద్దతు జనసేన పార్టీకే అని తెలపడంతో అక్కడ జనసేన శ్రేణుల్లో సంతోషం వెల్లివిరిసింది. జనసేన కరపత్రాలు పంచుతూ, కలిసిన వారందరినీ ఆప్యాయంగా అభివాదం చేస్తూ… వారితో మమేకమవుతూ విజయవంతంగా ఈ కార్యక్రమం ముందుకు సాగింది. ఈ “మహాపాదయాత్ర”లో జనసేన సీనియర్ నాయకులు, జనసైనికులు వెంకటలక్ష్మి వెంట పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-28-at-20.42.57-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-28-at-20.42.53-1-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-28-at-20.42.55-2-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-28-at-20.42.55-1-1-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-28-at-20.42.57-1-1-1024x576.jpeg)