జనసేనకు ఒక్క అవకాశం కల్పించండి: చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి

నెల్లూరు: రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో జనసేనకు ప్రతి ఒక్కరు మద్దతుగా నిలిచి తమ అభ్యర్థులను గెలిపించాలని జనసేన జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నగరంలోని ఏడవ డివిజన్ వీవర్స్ కాలనీలో సోమవారం సాయంత్రం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి అక్కడ స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మనుక్రాంత్ రెడ్డి మాట్లాడుతూ గత ఎన్నికల్లో అనేక వాగ్దానాలతో అధికారంలో కూర్చున్న వైసీపీ ప్రభుత్వం హామీలను విస్మరించిందన్నారు అధిక ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంలో వైసిపి ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జనసేన నెల్లూరు నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు తదితరులు పాల్గొన్నారు.