“జనసేనకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి” 10వ రోజు

పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన రాష్ట్ర అభివృద్ధికై జనసేనకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి కార్యక్రమంలో భాగంగా 10వ రోజు గొల్లప్రోలు పట్టణం మెయిన్ రోడ్ లో జరిగింది. ముందుగా శివాలయం దర్శించుకుని స్థానిక కార్యకర్తలు, నాయకులు సహకారంతో శేషుకుమారి ప్రతి గడపగడపకు వెళ్లి ప్రజలతో మమేకమై జనసేన యొక్క ఆశయ సిద్ధాంతాలను వారికి వివరించి వచ్చే ఎన్నికల్లో గాజు గ్లాస్ గుర్తుకు అమూల్యమైన ఓటును వేసి జనసేన పార్టీని గెలిపించండి అన్నారు. స్థానిక ప్రజలు వారికున్న సమస్యలు, ఇబ్బందులు ఆమెకు వివరించారు. అదే విధంగా ఈసారి ఎన్నికల్లో గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేస్తామని ఆమెకు సంఘభావం తెలిపారు. ఈ సంధర్భంగా శేషుకుమారి గారు మాట్లాడుతూ ఇప్పటికైనా పట్టణంలో సమస్యలు పరిష్కరించాలి డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో గొల్లప్రోలు టౌన్ ప్రెసిడెంట్ వినుకొండ శిరీష, రూరల్ మహిళా ప్రెసిడెంట్ వినుకొండ అమ్మాజీ, గున్నబత్తుల రాంబాబు, గుండ్ర హరీష్, నారపరెడ్డి రాజా, రెడ్డి శ్రీకాంత్, గణేష్, శ్రీరామ్, మనీ, నాగు, కీర్తి శివప్రసాద్, తన్పూరెడ్డి సతీష్, వల్లభశెట్టి మని, హరీష్, రాజా, శ్రీరామ్, దుర్గ, చక్రధర్, శివ, కార్తీక్, మణికంఠ, సాయి కోటి, నూకరాజు, లక్ష్మణ్, నాయకులు, మండల ప్రెసిడెంట్ లు అమరాది వల్లి రామకృష్ణ, పట్టా శివ, బుర్రా సూర్య ప్రకాశరావు, గోపు సురేష్, దొడ్డి దుర్గాప్రసాద్, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.