ప్రజా ప్రభుత్వానికి అవకాశం ఇవ్వండి

నెల్లూరు సిటీ: ప్రజా ప్రభుత్వానికి అవకాశం ఇవ్వండి అంటూ.. తెలుగుదేశం పార్టీ సిటీ ఇంచార్జ్ మాజీ మంత్రివర్యులు పొంగూరు నారాయణ ప్రచారంలో భాగంగా శుక్రవారం గాంధీ బొమ్మ వద్ద జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ కలిసి వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపేందుకు తోడుగా నడుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సిటీ ఇంచార్జ్ నారాయణ, జనసేన ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, జనసేన నాయకులు గూడూరు వెంకటేశ్వర్లు, పూసల మళ్ళేశ్వర రావు, తెలుగుదేశం పార్టీ నాయకులు కొండా ప్రవీణ్, సందీప్ మరియు ఇతర జనసేన, తెదేపా కార్యకర్తలు పాల్గొన్నారు.