క్యాన్సర్ తో బాధపడుతున్న మహిళకి జికె ఫౌండేషన్ ఆర్ధికసాయం

విశాఖ, గౌరీ వీధి, వేంకటేశ్వర మెట్టలో నివసిస్తున్న పితాని మరియ అను మహిళ క్యాన్సర్ తో బాధపడుతుందని తెలిసి ప్రతీ నెల లాగే ఈ నెల కూడా 1000/- చొప్పున వారి కుటుంబానికి ఆర్థికంగా జికె ఫౌండేషన్ తరపున ఇవ్వడం జరిగింది. ఈ నెల అందించిన 24వ చెక్కు ఇవ్వడం జరిగింది 24*1000=₹24,000. కావున, సహాయం చేయాలి అనుకునే దాతలు ముందుకు వచ్చి ఫౌండేషన్ సభ్యులను సంప్రదించాలి అని కోరుకుంటున్నామని తెలిపారు.