రాజాం జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్టమస్ వేడుకలు

రాజాం నియోజకవర్గ జనసేన యువనాయుకులు యు.పి.రాజు ఆధ్వర్యంలో క్రిస్టమస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానికి అనాధ వృద్ధ ఆశ్రమంలో ఉన్న వృద్ధులుకు దుప్పట్లు పంపిణీ చేశారు.అనంతరం యు.పి.రాజు మాట్లాడుతూ సర్వమానవాళికి ప్రేమనురాగలు పంచినపడే శాంతి, స్వేచ్ఛ, అనందాలకు చేరువ అవుతామని సత్యం, ధర్మం, స్వేచ్ఛ, న్యాయం కాపాడగలిగిన వారే మహోన్నత వ్యక్తులు అవుతారని యేసుక్రీస్తు చెప్పిన మాటలు అచరిద్దామని యేసుక్రీస్తు చేసిన బోధనలు సమాజానికి మార్గదర్శకాలు అని అన్నారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.