మర్రాపు సురేష్ ఆధ్వర్యంలో గుడ్ మార్నింగ్ సీఎం సార్ క్యాంపెయిన్

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు, మొద్దునిద్ర పోతున్న వై ఎస్ జగన్ ప్రభుత్వాన్ని తట్టి లేపేందుకు చేపట్టిన కార్యక్రమం #GoodMorningCMSir

ఈ కార్యక్రమం మూడు రోజులపాటు అనగా ఈ నెల 15,16,17 తేదీలలో రాష్ట్రమంతటా చేయటానికి జనసేన పార్టీ కార్యకర్తలు ఉద్యమిస్తున్నారు.

గజపతినగరం నియోజకవర్గం సీనియర్ నాయకులు మర్రాపు సురేష్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 10.30 గంటలకు, గజపతినగరం నుంచి కెంగువ గ్రామం వైపు కార్యక్రమం ప్రారంభం చేయడం జరిగింది. స్థానికంగా ఉన్న రోడ్ల దుస్థితి పై నిరసన తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు జిల్లా సీనియర్ నాయకులు అద్దడ్ మోహన్ రావు, మిడతాన రవి కుమార్, అడబలా వెంకటేష్ నాయుడు, సురేష్ రెడ్డి, గజపతినగరం నాయకులు ఆదినారాయణ, పండు, హరీష్, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

• ఆంధ్రప్రదేశ్ రహదారుల దుస్థితిని తెలియచేసేందుకు #GoodMorningCMSir హ్యాష్ ట్యాగ్ తో డిజిటల్ క్యాంపెయిన్ చేయడం జరిగింది.

#GoodMorningCMSir