యు.పి.రాజు నాయకత్వంలో గుడ్ మార్నింగ్ సీఎం సార్

రాజాం, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు రాజాం నియోజకవర్గం నాయకులు యు.పి.రాజు నాయకత్వంలో గుడ్ మార్నింగ్ సీఎం సార్ హ్యాష్ ట్యాగ్ తో ముఖ్యమంత్రికి తెలిసేలా అద్వానంగా ఉన్న రాజాం-పాలకొండ, రాజాం-చీపురుపల్లి గుంతల రోడ్లు వద్ద డిజిటల్ క్యాంపైన్ నిరసన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా స్థానిక జనసేన పార్టీ జడ్పీటీసీ అభ్యర్థి సైడలా జగదీశ్వరరావు మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు అయినా రోడ్లు వేయలేని దుస్థిలో ఉండటం దారుణమని ఇప్పటికి అయినా మేలుకొని తొందరగా రోడ్లు వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో నాయకులు రెడ్డి బాలకృష్ణ, నమ్మి దుర్గారావు, ఈశ్వర్, శ్యామ్, అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.