జగన్ సర్కారుకు కేంద్రం అదిరిపోయే శుభవార్త

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం సోమవారం శుభవార్త చెప్పింది. కష్టకాలంలో ఏపీకి కేంద్రం జీఎస్టీ పరిహార నిధులు విడుదల చేసింది. మోదీ సర్కారు తీసుకొచ్చిన జీఎస్టీ విధానంతో పలు రాష్ట్రాలు భారీగా నష్టాలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. దీంతో కేంద్రం విడతల వారీగా పరిహారం అందిస్తోంది.ఇందులో భాగంగా మరో దఫా జీఎస్టీ పరిహారాన్ని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. జీఎస్టీ విధానంతో పలు రాష్ర్టాలు ఎదుర్కొంటున్న నష్టాల భర్తీకి కేంద్రం చర్యలు తీసుకుంటోంది. గతేడాది డిసెంబర్‌లో విడుదల చేయగా ఇప్పుడు మరోసారి కేంద్ర ఆర్థిక శాఖ పరిహారం అందించింది.ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ఆర్థిక శాఖ సోమవారం పరిహారం కింద మొత్తం 3,174.15 కోట్లు విడుదల చేసింది. స్పెషల్ బారోయింగ్ ప్లాన్‌లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు రూ.1,810.71 కోట్లు విడుదల చేయగా, తెలంగాణ రాష్ర్టానికి రూ.1,336.44 కోట్లు విడుదల చేసింది. జీఎస్టీ పరిహారం విషయమై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రాన్ని పలుమార్లు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే.